అక్కినేని హీరోగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమా తండెల్ చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గీత బ్యానర్పై తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నేపథ్యంలోనే నాగచైతన్యసినిమా చేస్తూనే మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే  గతేడాది  చివరిలో దూత వెబ్ సిరీస్ చేసాడు నాగచైతన్య. ఇక ఈ సిరీస్ తో ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

కాగా అక్కినేని నాగచైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుంది. నాగచైతన్యకు ఈ సిరీస్ మంచి కంబ్యాక్ ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా ఈ సిరీస్ నాగచైతన్య గ్రాఫ్ ను పెంచేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీరీస్ పార్ట్ 2 కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో హీరోయిన్గా టాలీవుడ్ డాక్టర్ పాప యంగ్ టాలెంటెడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల లక్కీ ఫిక్స్ అయింది అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. కాగా ఈ సినిమాలో నాగచైతన్య తో కలిసి ఈ యంగ్ హీరోయిన్ రొమాన్స్

చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కాగా  ఇప్పటికే పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష లాంటి సినిమాలు తో భారీ పాపులాటి దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇక దూత 2 వెబ్ సిరీస్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటూనే.. రొమాంటిక్ సీన్స్ కి కూడా మంచి స్కోప్ ఉండేలా డైరెక్టర్ విక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వారు ఈ వార్తలు తెలియాలి అంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.!!

మరింత సమాచారం తెలుసుకోండి: