మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. కేవలం మరికొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మే నెల ఎండింగ్ వరకు ఈ సినిమా మొత్తం షూటింగ్ ను పూర్తి చేసే విధంగా ఈ మూవీ మేకర్స్ ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే చరణ్ ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నై కి బయలు దేరాడు. అక్కడ రెండు రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.

కేవలం రెండు రోజుల పాటే చెన్నై లో ఈ మూవీ యూనిట్ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. ఆ రెండు రోజుల షూటింగ్ పూర్తి కాగానే మళ్లీ కొత్త షెడ్యూల్ ను రాజమండ్రి లో ప్రారంభించారు. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రి లో గేమ్ చేంజర్ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న తారాగణం అంతా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: