ఇటీవలే గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా కాపు ఉద్యమ నేత, వైసిపి నాయకుడు ముద్రగడ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన కుటుంబంలో చిచ్చు పెట్టారని తన కూతురితో నానామాటలనిపించారని టిడిపి జనసేన నాయకుల పైన ఫైర్ అయ్యారు. తాజాగా ముద్రగడ మాట్లాడుతూ తన కుటుంబంలో చిచ్చు పెట్టిన కూడా తాను భయపడనని తన సొంత నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం తో ఇటీవలే పలు విషయాలను వెల్లడించారు.


తన కూతురిని మీకు అనుకూలంగా మార్చుకొని.. తన పైన నానా మాటలు అనేలా చేశారు. రాజకీయాలలోకి కుటుంబాన్ని కూడా లాగారు కాబట్టి తాను కూడా అందరి కుటుంబాల్ని లాగాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ తన ముగ్గురు భార్యలను పరిచయం చేయగలరా అంటూ కూడా ఫైర్ అయ్యారు. వారి స్థితి గతుల గురించి ఏమైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.. తన కూతురికి ముద్రగడ కూతురు అనే కాకుండా తన అత్తింటి పేరు వాడి పరిచయం చేయమని కూడా ఫైర్ అయ్యారు.. ఎలాగో తన కూతురిని రోడ్డుపైకి తీసుకువచ్చారు కాబట్టి టీవీలలో డెబిట్ లో పెట్టి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో రోడ్లమీద తిప్పండి నాకేమీ భయం లేదు అన్నట్టుగా ఫైర్ అయ్యారు.


కులాలలో కుటుంబాలలో చిచ్చు పెట్టమని మీ గురువు మీకు ఏమైనా చెప్పారా అందుకే మీరు ఇలా తయారు అయ్యారంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ తన కూతుర్ని కూడా ప్రశ్నించారు.. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ చుట్టూ ఉండే నాయకులకే ఏమీ ఇవ్వలేరు అలాంటిది తన కూతురికి పదవి ఇస్తారా అంటూ ఎద్దేవ చేశారు.. పవన్ కళ్యాణ్ ను భీమవరం గాజువాక నుంచి ప్రజలు తరిమేస్తే ఇప్పుడు పిఠాపురంలో వచ్చి పడ్డారు పిఠాపురంలో కూడా త్వరలోనే ప్రజలు తరిమేయబోతున్నారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించాలి కానీ రాజకీయాల్లో కాదంటూ కూడా తెలిపారు.. లక్ష పుస్తకాలు చదివేసిన పవన్ కళ్యాణ్ కులాలలో కుటుంబాలలో చిచ్చు పెట్టడం మాత్రమే నేర్చుకున్నారంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇలా ట్రైనింగ్ ఇచ్చింది ఆయన గురువు చంద్రబాబు నాయుడు అంటూ కూడా విమర్శించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: