జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ అనే టైటిల్ తో సినిమా అని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా పేరు కూడా మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రస్తుతం కర్ణాటకలో ఒక భారీ సెట్ వేసి జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా షూటింగ్ కోసం గత కొద్దిరోజులుగా అక్కడే ఉన్నారట. ముఖ్యంగా పెద్ద హెలికార్టర్ తో పాటు ఇల్లు, రైల్వే ట్రాక్లు ,భారీ తుపాకులు, ట్యాంకర్లను సైతం సినిమా సెట్లోకి తీసుకువచ్చి మరి పార్కింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.


బారి సెట్లో రమణగింది బీచ్ లో కూడా నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సలార్, కేజిఎఫ్ లకు మించి మరీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి సాయంత్రం 7:00 వరకు జరుగుతోందట. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లోకి ఎవరిని కూడా బయటి వారిని అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత నటిస్తోంది. గతంలో ప్రశాంత్ నీలి చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవి బన్సూర్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారట.

ప్రశాంత్ నిల్ ఈ సినిమా షూటింగ్ కోసం తన పాత టీమ్ ని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని జూనియర్ ఎన్టీఆర్ వారం క్రితం సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా యాక్షన్ సినిమా గా ఉండబోతోందని ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏడాది చివరికి పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వచ్చే ఏడాది పూర్తి చేసి ఏప్రిల్ నాటికి విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: