త్వరలోనే అక్కినేని ఇంట పెళ్లి భాజ మోగనున్న విషయం అందరికి తెలిసిందే.  రీసెంట్ గానే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహం వద్ద జరిగింది . అక్కడ పెళ్లి చేసుకుంటే తాతగారు ఆశీస్సులు ఉంటాయి అన్న కోణంలో ఆలోచించి నాగచైతన్య పెళ్లి గ్రాండ్గా వద్దు చాలా సింపుల్ గా చేయాలి అంటూ డిసైడ్ అయ్యి శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేశారు నాగ చైతన్య. దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించిన అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది శోభిత ధూళిపాళ్ల టీం.


కాగా ఇప్పుడు అక్కినేని ఇంట మరొకసారి శుభకార్యం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగార్జున ఏం చేసినా సరే సైలెంట్గా పద్ధతిగా చేస్తూ ఉంటారు . తన రెండవ కుమారుడు అఖిల్ నిశ్చితార్ధం  కూడా అంతే గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా చేసేసాడు . ఒక పోస్టుతో నా చిన్న కోడలు జైనబ్ రవ్జీ అంటూ అఫీషియల్ గా డిక్లేర్ చేశారు.  వీళ్ళ పెళ్లి నిజానికి మార్చిలోనే జరగాల్సింది . కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడిందట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వీళ్ళ పెళ్లి ఆగస్టులో జరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది .



దానికి సంబంధించిన పనులు మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారట నాగార్జున - అమల అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇండియాలో కాకుండా దుబాయ్ లో జరిపేలా ప్లాన్ చేస్తున్నారట . అక్కడ సెలబ్రిటీస్ అందరికీ తగిన సెక్యూరిటీ ఇవ్వగలము అని ఆ తర్వాత హైదరాబాద్లో పొలిటీషియన్స్ ..నాగార్జున పలుకుబడికి సంబంధించిన వ్యక్తులకు స్పెషల్ గా ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారట.  ఆగస్టు లో అఖిల్ పెళ్లి జరగబోతుంది అన్న వార్త ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: