
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై రోజుకొక అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ?వస్తుందా ? అని కేవలం తెలుగు సినీ ప్రేమికులు మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు అందరూ ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ - కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం జూన్ మూడోవారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తారట. ఇందుకోసం చాలా స్పెషల్ సెట్ వేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని .. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా తన కెరీర్లో అత్యుత్తమ సినిమాలలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ కంకణం కట్టుకుని మరి కసి తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. ఎప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాలలో కెల్లా ఇదే బెస్ట్ సినిమా అవుతుందని ప్రశాంత్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు