
ఇటీవల ఇద్దరూ కలిసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, "రజనీ నన్ను చూస్తే – నీవు ఇప్పటికీ కోపంగా ఉంటావు. పుస్తకాలు చదవడం కాదు, వాటి సారాంశాన్ని అర్థం చేసుకో. కోపాన్ని వదిలేయ్" అంటూ సలహా ఇచ్చాడంటూ మోహన్ బాబు అన్నారు. ఇది వినగానే పలువురు అభిమానులు స్పందిస్తూ – “ఒక నిజమైన స్నేహితుడు ఇలాగే మాట్లాడతాడు” అని కామెంట్లు చేస్తున్నారు. రజనీ హైదరాబాద్ వచ్చిన ప్రతీసారీ మోహన్ బాబుని కలవడం ఈ స్నేహ బంధానికి అద్దం పడుతుంది. ఇద్దరూ మీడియా ముందు తమ బంధాన్ని ఎన్నోసార్లు వెల్లడించగా – వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చూస్తే అభిమానులే కాక సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
ఇటీవల మోహన్ బాబు ‘కన్నప్ప’ సినిమాలో వాయులింగాన్ని కాపాడే మహాదేవశాస్త్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్కి ప్రత్యేకంగా చూపించగా – ఆయన చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకప్పుడు మధ్యతరగతి పరిస్థితుల్లో సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరూ నేడు కోట్లాది మందికి ఆదర్శంగా మారారు. వారిద్దరి మానవీయ సంబంధం, పరస్పర గౌరవం నేటితరానికి స్ఫూర్తిదాయకం. నిజమైన స్నేహానికి మతం, భాష, పదవి, పాపులారిటీ అడ్డంకులు కావు అనే విషయాన్ని మోహన్ బాబు – రజనీ స్నేహం మరోసారి నిరూపించింది.