నేటి ఆధునిక యుగంలో ప్రేమ, ప్రేమ పెళ్లిళ్లు అనేవి సహజం, సర్వ సాధారణం. అయితే నేటి ఆధునిక యుగంలో ప్రేమ పెళ్లికి సహకారం కూడా అత్యవసరం. అయితే ఎవరో ఒకరి సహకారం లేనిదే ప్రేమ పెళ్లి జరగదనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ ప్రేమ పెళ్లి లో ఎన్నో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ప్రేమ పెళ్లిళ్లు జరిగినప్పుడు పెళ్లి చేసుకున్న వారు కనబడకుండా పోయినప్పుడు వారికి సహకరించిన వారిపై వరుడు తరుపు కానీ, వధువు తరుపు బంధువులు గానీ వారికి సహకరించిన వారిపై  ప్రతీకార దాడికి దిగుతూ ఉంటారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. 



ప్రేమికులకు సహకరించాడన్న కసితో.. పదమూడేళ్ల బాలుడిని గుళ్లో శూలాలకు గుచ్చి చంపేశారు. తమిళనాడులోని తంజావూరుజిల్లాలో జరిగిందీ దారుణం. జిల్లాలోని వీరమంజేరికి చెందిన అరుణ్‌కుమార్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. అతని ఇంటిపక్కనే ఉన్న బంధువు కలైసెల్వి (18).. అదే గ్రామానికి చెందిన అరుళ్‌ (23)తో ప్రేమలో పడింది. వారిద్దరికీ అరుణ్‌ ‘మాట సాయం’ చేస్తున్నట్లు కలైసెల్వి బంధువులకు అనుమానం వచ్చింది.



ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం నుంచి అరుణ్‌కుమార్‌ కనిపించకుండాపోయాడు. అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరమంజేరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మణి ఆండవర్‌ ఆలయ త్రిశూలాలకు అరుణ్‌కుమార్‌ శవం వేలాడుతున్నట్లు బుధవారం ఉదయం సమాచారం అందడంతో పోలీసులు అక్కడికెళ్లి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అతన్ని తానే చంపేశానని కలైసెల్వి సోదరుడు కదివరన్‌ ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: