ఎలాంటి సాక్ష్యాలు ... ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని ఈ పిటిషన్ వేసినట్టు ఉందని కూడా హైకోర్టు ఆక్షేపించింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు బెయిల్ ఇచ్చాక ఎనిమిది సంవత్సరాలకు ఈ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ ఎందుకు ? వేసారని కూడా రఘురామ ను నిలదీసింది. జగన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ జగన్ తో ఉన్న రాజకీయ వైరుధ్యం నేపథ్యంలోనే ఇప్పుడు ఎంపీ రఘురామ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు.
ఇక ఇదే కేసును గతంలో విచారించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా ఈ కేసును కొట్టివేసిన విషయాన్ని జగన్ తరఫు లాయర్ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కావాలనే జగన్ కు వ్యతిరేకంగా ఈ కేసు వేసినట్టు కూడా జగన్ లాయర్ ఆరోపించారు. అయితే హైకోర్టు వేసిన పలు ప్రశ్నలకు ఎంపీ రఘురామ తరపున లాయర్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో రఘురామ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.