నేడు ప్రపంచ వ్యాప్తంగా మహిళల పరిస్థితి చూస్తే రక్షణ లేకుండా పోతోంది. పొద్దున్న స్కూల్ కి, కాలేజీ కి లేదా ఒక ఉద్యోగ నిర్వహణకు వెళ్లిన ఏ మహిళ అయినా మళ్ళీ సేఫ్టీ గా సాయంత్రం ఇంటికి వచ్చే వరకు తల్లి తండ్రులకు టెన్షన్ గానే ఉంటుంది. అంతలా మన దేశంలో మానవ మృగాలు ఎక్కువ అయ్యాయి. అయితే ఇలా మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఆపడానికి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎన్ని కఠినమైన నిబంధనలు అమలు లోకి తెస్తున్న అవేమీ పట్టించుకోకుండా రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చట్టం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల సంరక్షణ కోసం రూపొందించబడింది. అయితే ఈ చట్టాలను ఎన్ని రాష్ట్రాలు సక్రమంగా అమలు చేస్తున్నాయి అన్నది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రము ఆడపిల్లల రక్షణ మోసం ఒకడుగు ముందుకు వేసింది. ఇందుకోసం పోక్సో కోర్ట్ లను తీసుకువస్తోంది. ఎవరైతే అన్యాయం గా మృగాళ్ల బారిన పడి బాధలు పడుతున్నారో వారికీ న్యాయం చేయడానికి అవసరం అయినన్ని పోక్సో కోర్ట్ లను స్థాపించడానికి కేసీఆర్ సర్కారు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ మరియు జనగామ జిల్లాలలో ఈ రోజు పోక్సో కోర్ట్ లను స్టార్ట్ చేయనున్నారు.

ఈ కోర్ట్ లను తెలంగాణ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర వర్చ్యువల్ గా స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ కోర్ట్ ల ద్వారా అందరికీ న్యాయం చేకూర్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది. అయితే ఈ కేసులకు సంబంధించి బాలికల విషయాలను బహిర్గతం కాకుండా సీక్రెట్ గా ఉంచి విచారణ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: