ఇక్కడ దసరా బ్రహ్మోత్సవ కార్యక్రమముల విషయం లోకి వస్తే...... బహు ఘనంగా వేడుకల్ని జరుపుతారు. ప్రతీ ఏటా వైవిధ్యభరితంగా అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, రాజరాజేశ్వరి దేవి రూపాలలో అలంకరణ చేయడం తో పాటు ప్రధాన దేవతా హోమాలు జరుపుతారు. ఇలా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అనేక ప్రాంతాల నుండి భక్తులు, భవానీలు దర్శనానికి వస్తారు. శ్రీ చక్ర ఆలయంలో మూడో అంతస్తు లో అంటే బిందు స్థానంలో శయనించిన సదా శివుని మీద కూర్చునే అమ్మవారి నిలువెత్తు విగ్రహం బాగా ఆకట్టుకుంటుంది.
దేవిపురం సహస్రాక్షి శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం విశాఖపట్నం కు అతి దగ్గర లో ఉన్న సబ్బవరం కి కేవలం ఐదు కిలో మీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. ఇక్కడే సహస్రాక్షి పేరుతో శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం వెలసింది. అంతే కాదు ఈ ఆలయం లో శక్తి పూజలు చేయడానికి కామాఖ్యా పీఠాన్ని నిర్మించారు. అలానే శివ పూజల కోసం కొండ మీద శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది.