ఈ మధ్య కాలంలో మనలో చాలామంది సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆధార్ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంతమంది ఆదాయం సంపాదిస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే ఆధార్ శాశ్వత కేంద్రాలను నడపాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. యూఐడీఏఐ నిర్వహించే పరీక్షలో కనీసం 65 శాతం మార్కులు పొందిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలోని  ఆధార్  శాశ్వత కేంద్రాలన్నీ  ఇన్ హౌస్ మోడల్ విధానంలోకి మారడమే  ఇందుకు కారణమని చెప్పవచ్చు.  గత మూడు సంవత్సరాల నుంచి  తెలంగాణ రాష్ట్రంలో  ఈ  విధానం అమలవుతుండటం గమనార్హం  కొందరు ఆధార్ కేంద్రాల  నిర్వాహకులు  వేతనాలకు బదులు కమిషన్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా  యూఐడీఏఐ ప్రతినిధుల మధ్య, ఆధార్ కేంద్రాల నిర్వాహకుల మధ్య సయోధ్య  కుదిరింది.

ఇన్ హౌస్ మోడల్  కేంద్రాల పరికరాలకు  డిపాజిట్లు  చెల్లించాలని  ప్రభుత్వం నోటిఫికేషన్  ఇచ్చిందని  వాళ్లకు ల్యాప్ టాప్ సహా  లక్షా 50  వేల  రూపాయల  విలువైన సామాగ్రి అందనుందని సమాచారం  అందుతోంది.  ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాళ్లపై  కఠినంగా చర్యలు ఉంటాయని  ఆ కేంద్రాన్ని  కొత్తవారికి అప్పగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

రాష్ట్రంలో మొత్తం 1151  ఆధార్ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయగా  వేర్వేరు కారణాల వల్ల 424 కేంద్రాలు మూతపడ్డాయని  ప్రస్తుతం 727 కేంద్రాలు పని చేస్తున్నాయని ఈ కొత్త విధానం ద్వారా అన్ని కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఆధార్ కేంద్రాల ఏర్పాటు  ద్వారా  ఊహించని స్థాయిలో లాభాలను  పొందే  ఛాన్స్ అయితే ఉంటుంది.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: