
హనుమాన్ చాలీసా లోని పంక్తులను జపించడం వల్ల ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మరీ ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు హనుమాన్ చాలీసా లోని ఈ పంక్తులను జపిస్తే అంతా శుభం జరుగుతుంది అంటున్నారు పండితులు . హనుమాన్ చాలీసాను చాలామంది జపిస్తూ ఉంటారు అయితే దాని అర్థం కొంతమందికి తెలియదు . అర్థం తెలియక హనుమాన్ చాలీసా ను పఠిస్తే పుణ్యం లభించదు అంటున్నారు పండితులు .
హనుమాన్ చాలీసా ని జపిస్తున్నప్పుడు దానిలోని ప్రతి పంక్తి అర్ధాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఆ కోరికలు నెరవేరుతాయి. గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసాలోలు అనేక అద్భుతమైన పంక్తులను రచించారు వాటిలో ఒకటి . “నాసై రోగ హరై సబ పీరా, జపత నిరంతర హనుమత బీరా”. హనుమాన్ చాలీసాలోని 25వ పంక్తి ఇది. ఇందులో గోస్వామి తులసీదాస్ ఆంజనేయ స్వామిని నిరంతరం జపించడం ప్రాముఖ్యతను వివరించారు.
నాశై రోగ: “నాశై రోగ” అనగా రోగాలు ..వ్యాధులు నశించిపోతాయి, నాశనమవుతాయి. అంటే, ఈ పంక్తిని జపించడం ద్వారా అన్ని రకాల శారీరక వ్యాధులు తొలగిపోతాయి.
హరై సబ పీరా: “హరై సబ పీరా” అంటే అన్ని బాధలు ..నొప్పి.. దుఖం తొలగిపోతాయి. ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తి శరీరానికి పట్టిన అన్ని రకాల రోగాలు, కష్టాలు దూరమవుతాయి.
జపత నిరంతర: “జపత నిరంతర” అంటే నిరంతరం ఎల్లప్పుడూ, క్రమం తప్పకుండా జపించడం. అంటే, మీరు ప్రతిరోజూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే, ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠిస్తే, మీకు ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని అర్ధం.
హనుమత బీరా: “హనుమత బీరా” అంటే ధైర్యవంతుడైన హనుమంతుడు. అనగా.. నిరంతరం హనుమంతుని నామాన్ని జపించేవారికి ఆ మహావీరుని రక్షణ లభిస్తుంది.
హనుమాన్ చాలీసాలోని ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తికి శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుందని అర్ధం. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ సుఖశాంతులు లభిస్తాయి ఐ చెప్తున్నారు..!!