భారత క్రికెట్ లో జరుగుతున్న అన్ని రకాల పరిణామాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు పోస్ట్ లు పెడుతూ ఉంటారు వీరేంద్ర సెహ్వాగ్. ఇక వీరేంద్ర సెహ్వాగ్ పెట్టే పోస్టులు కాస్త ఫన్నీగా.. కొంచెం సెటైరికల్ గా ఉంటాయి. ఇక ఇటీవల మరోసారి పంజాబ్ కింగ్స్ జట్టును ఉద్దేశిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. నిన్న ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. అయితే తుది జట్టు ఎంపికలో కీలక ఆటగాళ్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా విధ్వంసకర బ్యాట్స్మన్ గా కొనసాగుతున్న క్రిస్ గేల్ ని తుది జట్టులోకి తీసుకోకుండా ఉండడం పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ పై సెటైర్లు వేశారు. పంజాబ్ ప్లేయింగ్ ఎలెవెన్ ను మార్చినంత తరచుగా అటు చిన్న పిల్లల డైపర్ లు కూడా మార్చలేరు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్ పేల్చాడు. ఇక వీరూభాయ్ కామెంట్స్ కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారిపోతున్నాయి.