భారత ప్రభుత్వం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిటీ ఇటీవల ఒక హెచ్చరికను యూజర్ల కోసం జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఇందులో గూగుల్ క్రోమ్ లో నిర్దిష్టమైన వర్షన్ లో అనేక బగ్స్ ఉన్నట్లుగా హెచ్చరించడం తెలియజేస్తోంది.. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ ప్రకారం బ్రౌజర్ భద్రత ప్రమాణాల గురించి మరొకసారి క్రోమ్ యూజర్లను సైతం హెచ్చరిస్తోంది. హెచ్చరిక ప్రకారం క్రోమ్ యూజర్లు తమ సమాచారాన్ని బహిర్గతం చేసే విధంగా పలు రకాల భద్రత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలియజేసింది.


ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఫిషింగ్ అటాక్స్ డేటా ఉల్లంఘనలు మాల్వేర్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లుగా గుర్తించింది. దీంతోపాటు తమను తాము ప్రోడక్ట్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం చాలా మంచిదని కూడా తెలిపింది. ముఖ్యంగా అటాక్ చేసే వ్యక్తి మన కంప్యూటర్ను కంట్రోల్ చేయడానికి అనుమతించే పలు రకాల లోపాలను గూగుల్ క్రోమ్ కలిగి ఉందట. Api, Swift shader,vulkan,video,WEBRTC సహా క్రోమ్ పలు రకాలు లోపాలు ఉన్నాయని తెలియజేస్తోంది దీంతోపాటు అటాక్ చేసే వ్యక్తి వీడియోలో హిప్ బఫర్ ఓవర్ ఫ్లో పిడిఎఫ్ లో వంటిని కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.


CVE...2023-4068,2023-4069,2023-4070,2023-4071,2023-4072.. అలా 4078 వరకు లోపాలను కలిగి ఉన్నది గూగుల్ క్రోమ్.

V8 లో గందరకోలం కారణంగా గూగుల్ క్రోమ్ లో పలు భద్రత లోపాలు ఏర్పడ్డాయని సమాచారం. దీనివల్లే హానికరమైన వెబ్సైట్ని విజిట్ చేసే యూజర్లు సైతం మోసగించడం ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి వాటి నుంచి మనం వీలైనంత త్వరగా బయటపడాలి అంటే గూగుల్ క్రోమ్ ని లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ చేయడం మంచిది. ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు సరికొత్త అప్డేట్ ను సైతం రిలీజ్ చేసింది గూగుల్ క్రోమ్.

గూగుల్ క్రోమ్ అప్డేట్ చేయాలి అంటే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత విండో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మూడు చుక్కలను క్లిక్ చేయాలి..HELP>GOOGLE CHROME>ABOUT ను ఎంచుకోవాలి. అక్కడ అప్డేట్ అందుబాటులో ఉంటే కురుందాన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రోమ్ ఒకసారి రీస్టార్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: