
రేవంత్రెడ్డి తమ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. వంద ఏళ్ల కులగణన కలను నెరవేర్చి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన వివరించారు. గత 18 నెలల పాలనను గోల్డెన్ పీరియడ్గా అభివర్ణించిన రేవంత్, ఈ విజయాలను ప్రజలకు చేరవేయాలని నాయకులకు ఆదేశించారు.
పార్టీ నాయకులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేయాలని రేవంత్ ఆదేశించారు. పార్టీ పదవులను చిన్నచూపు చూడకుండా, వాటిని గొప్ప అవకాశాలుగా భావించాలని సూచించారు. రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కార్యకర్తలకు మరిన్ని పదవులు దక్కుతాయని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనతో పోల్చి కాంగ్రెస్ హయాంపై బహిరంగ చర్చకు సవాల్ విసరాలని నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన ఉద్ఘాటించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు