మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉండాలంటే..మూత్రపిండాలు ఎల్లప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే మూత్రపిండాల్లో ఖచ్చితంగా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో నీళ్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తాగడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మన శరీరంలో ఉండే మలినాలు మూత్రం ద్వారా చాలా ఈజీగా బయటకు పోతాయి. దీంతో మూత్రపిండాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఇంకా శుభ్రంగా ఉంచడంలో బార్లీ గింజలు మనకు చాలా బాగా సహాయపడతాయి.నీటిలో బార్లీ గింజలను వేసి రాత్రంతా కూడా వాటిని బాగా నానబెట్టాలి. తరువాత ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.ఇలా చేయడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. అలాగే తాజా పండ్లు ఇంకా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.


ఇక మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే మన జీవన శైలిలో కూడా ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి.ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి చాలా ఎక్కువగా పడుతుంది. ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే చాలా మంది కూడా పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల మూత్రపిండాలపై ఖచ్చితంగా చెడు ఫ్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇంకా అలాగే ప్రతి రోజూ నిద్ర పోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే నిద్రలేమి వల్ల కూడా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. కిడ్నీ సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: