సమంత పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది.. అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న ఈ అమ్మడు. ఇప్పుడు సినిమాల స్పీడ్ ను పెంచారు. పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ వచ్చిన ఐటమ్ సాంగ్ లో కనిపించిన సామ్ ఆ పాట భారీ హిట్ టాక్ ను అందుకోవడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది.. అదే స్పీడ్ తో వరుస సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది..శాకుంతలం సినిమాను పూర్థి చేసిన సామ్ వెబ్ సిరిస్ లలో కూడా నటిస్తుంది. అంతేకాదు వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు...



ఇది ఇలా ఉండగా..  ఇప్పుడు పిరియాడికల్ సినిమా యశోద సినిమా షూటింగ్ లో బిజిగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తీ చేసే పనిలో సామ్ ఉంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా కథ వినెందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు సామ్ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది.విజయ్ దేవకొండ, శివ నిర్వాణల సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇటు లైగర్ మూవీ కంప్లీట్ చేసిన విజయ్ ఇప్పుడు పూరిజగన్నాథ్ జనగణమన సినిమాలో నటించెందుకు రెడీ అయ్యాడు. 



అయితే, ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కియారా అద్వానీని ఫిక్స్ అయ్యారు. కానీ ఫైనల్ గా ఆ ఆఫర్ సమంత వద్దకి వచ్చిందనే టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది.. ఆ చిత్ర దర్శకుడు పూరిసినిమా గురించి సామ్ కు చెప్పగానే ఒకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన పూరి సినిమాని త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు విజయ్ కూడా అదే భావిస్తున్నారు.. కాగా,ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కాగా సమంత, విజయ్ దేవరకొండలు ఇప్పటికే మహానటి సినిమాలో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: