నైజం ప్రాంతం లో చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆ ప్రాంతం లో విడుదల చేసి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఇండస్ట్రీ లో తిరుగులేని స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజు..ఇండస్ట్రీ లో దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తున్నా సినిమా అంటే కచ్చితంగా సూపర్ హిట్ అనే బ్రాండ్ ఇమేజి కూడా ఉంది..క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఎన్నో బాక్స్ ఆఫీస్ వండర్స్ సృష్టించిన సినిమాలు నిర్మించిన దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాడు..రీసెంట్ గా సంచలన విజయాలుగా నమోదు చేసుకున్న #RRR మరియు kgf వంటి సినిమాలను నైజం ప్రాంత హక్కులను కొనుగోలు చేసింది  కూడా దిల్ రాజు గారే..ఈ రెండు సినిమాలకు లాభాలు ఏ స్థాయిలో వచ్చాయో మన అందరికి తెలిసిందే..ఇలా వరుస విజయాలతో కెరీర్ లో పీక్ స్టేజి ని ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు కి ఇటీవలే ఒక కొడుకు కూడా పుట్టాడు..మొదటి భార్య చనిపోయిన తర్వాత దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే


అయితే కొడుకు పుట్టిన తర్వాత దిల్ రాజు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడట ..అదేమిటి అంటే అతి త్వరలోనే ఆయన హైదరాబాద్ లో ఒక్క ఫిలిం స్టూడియో ని నిర్మించబోతున్నారని సమాచారం...అత్యాధునిక టెక్నాలజీ తో కనివిని ఎరుగని హంగులతో ఈ స్టూడియో నిర్మాణం కాబోతుంది..త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దిల్ రాజు గారు చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం..సుమారు 300 కోట్ల రూపాయిలు ఈ స్టూడియో నిర్మించడానికి ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది..కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు..వైజాగ్ లో కూడా ఒక స్టూడియో నిర్మించబోతున్నట్టు సమాచారం...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సినీ నిర్మాతలకు వైజాగ్ లో స్టూడియో కట్టుకునే ప్రతిపాదన తో వస్తే స్థలాలు ఉచితంగా ఇస్తాను అని అధికారిక ప్రకటన చేసిన విషయం మన అందరికి తెలిసిందే..దానితో దిల్ రాజు వైజాగ్ లో కూడా స్టూడియో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది..ఇది పక్కన పెడితే దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఒక్క భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న విషయం మనకి తెలుసు..ఈ షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుందట..నవంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట దిల్ రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: