మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో.. ఇప్పుడు రొమాన్స్ హైలైట్ కానుంది అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. 'దేవర'లో జాన్వీ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. ‘పెద్ది’లో మాత్రం ఆమె అందాన్ని, నటనను పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు బుచ్చిబాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. తాజా షెడ్యూల్‌లో రామ్ చరణ్ - జాన్వీ కపూర్ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించినది ఎవరో కాదు – సంగీత మంత్రగాడు ఏఆర్ రెహమాన్.
 

ప్రేమలోని విరహ వేదనను హృదయాన్ని తాకేలా రూపుదిద్దుతున్న ఈ పాటతో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ‘ఉప్పెన’లో కృతి శెట్టి పాత్రను ఎలా అందంగా ఆవిష్కరించాడో.. ఈ సినిమాలో జాన్వీ పాత్రను కూడా అంతే రొమాంటిక్ మూడ్‌లో తీసుకువెళ్తాడని టాక్. రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు రొమాంటిక్ విజన్, చరణ్-జాన్వీ జోడీ.. అన్నీ కలిసి ఈ మెలోడీ సాంగ్ సినిమాకే ప్రత్యేక హైలైట్ అవుతుందన్న భావన ఉంది. ఇప్పటికే రెహమాన్ ఈ పాటను చాలా కేర్‌తో కంపోజ్ చేశాడట. ప్రేమికుల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఈ గీతం ఉంటుందట. తెలుగు సినీ సంగీతంలో మరో మేజిక్ క్రియేట్ చేయబోతున్నాడన్న ఆసక్తికర అంచనాలు వినిపిస్తున్నాయి.



ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో రెహమాన్ ఎందుకు ఒప్పుకున్నాడనే ఆసక్తికర అంశం గురించి మాట్లాడుకుంటే.. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ వినగానే రెహమాన్ ఆసక్తి చూపాడట. పర్సనల్‌గా కథ విన్న తరువాత ఆయన వెంటనే అంగీకరించారట. ముఖ్యంగా చరణ్ కోసం సంగీత పరంగా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని రెహమాన్ టార్గెట్ చేసుకున్నాడని సమాచారం.మొత్తానికి ‘పెద్ది’ మాస్ బాడీకి మెలోడీ హృదయం కట్టబెట్టిన సినిమా అవుతుందనడంలో సందేహమే లేదు. ఈ రొమాంటిక్ టచ్ సినిమాకి అదనపు బజ్ తీసుకురానుందన్నది మాత్రం పక్కా!

మరింత సమాచారం తెలుసుకోండి: