ఇటీవలి కాలంలో తెలుగు సినిమా టికెట్ ధరలు పెరగడం ప్రేక్షకులకు పెద్ద భారంగా మారింది. ఒకప్పుడు సినిమాను కుటుంబంతో కలిసి చూసేందుకు థియేటర్‌కి వెళ్లడం సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు టికెట్ ధరలు పెరగడంతో చాలా మంది ప్రేక్షకులు ఆలోచించి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈ తంతు రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ చిత్రాల సమయంలోనే మొదలైందని చాలా మంది సినిమా ప్రేమికులు చెబుతున్నారు. ఆయన సినిమాల విజువల్ గ్రాండియర్ చూసి అభిమానులు ఎక్కువ రేట్లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే తరహాలో అధిక రేట్లు వసూలు చేయడం ప్రారంభించడంతో సగటు ప్రేక్షకుడు థియేటర్‌కి రావడానికి వెనుకడుగు వేస్తున్నాడు.


ఇప్పుడు రాజమౌళి తన అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్ “బాహుబలి”ను మరో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో, రెండు భాగాలను కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసారి కూడా టికెట్ రేట్లు పెంచుతారని అందరూ ఊహించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎలాంటి టికెట్ ధర పెంపు ఉండదట. ఇండియాలోనూ, ఓవర్సీస్ మార్కెట్లోనూ సాధారణ ధరలకే ఈ ఎపిక్ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇలా పాత సినిమాల‌ను రీ రిలీజ్ చేసి టిక్కెట్ రేట్లు పెంచ‌డం అంటే తెలుగు ప్రేక్ష‌కుల సినిమా బ‌ల‌హీన‌త‌ను ఆస‌ర‌గా చేసుకుని మ‌రింత పెద్ద దోపిడీకి తెర‌లేపిన‌ట్టు అవుతుంది.


ప్రభాస్, రానా దగ్గా బాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా కీలక పాత్రల్లో నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనుంది. ఈ రీ-మాస్టర్ వెర్షన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, మరోసారి బాహుబలి మేనియాను పునరావృతం చేస్తుందో ?  లేదో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: