ఆఫ్ఘానిస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు రావడం ప్రస్తుతం కష్టంగా మారింది. ఇందుకు ప్రధాన అడ్డంకి పాకిస్తాన్తో దోస్తీ మాత్రమే. దీంతో ఇప్పుడు తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. ఇదే సమయంలో తాలిబన్ల ఆకలి తీర్చేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్ దేశం తీవ్ర ఆహార కొరతతో ఇబ్బంది పడుతోంది. అటు అగ్ర రాజ్యం అమెరికా కూడా సాయం చేసే విషయంలో చేతులెత్తేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది భారత సర్కార్. ఏకంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను తక్షణ సాయం కింద ఆఫ్ఘాన్లకు ఐక్య రాజ్య సమితి ద్వారా అందించేందుకు ఓకే చెప్పింది. మొదటి నుంచి పాకిస్తాన్ కంటే భారత్ సాయం మేలని తాలిబన్లు భావిస్తున్నారు. అందుకే చాలా విషయాల్లో భారత్ వైపు మొగ్గు చూపేందుకు రెడీ అయ్యారు తాలిబన్లు. ఇప్పటికే అధికారికంగా రెండు సార్లు చర్చలు కూడా జరిపారు. ఆఫ్ఘాన్లకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా సాయం చేయాలని భారత్ను తాలిబన్లు కోరారు.
ఆఫ్ఘానిస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు రావడం ప్రస్తుతం కష్టంగా మారింది. ఇందుకు ప్రధాన అడ్డంకి పాకిస్తాన్తో దోస్తీ మాత్రమే. దీంతో ఇప్పుడు తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. ఇదే సమయంలో తాలిబన్ల ఆకలి తీర్చేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్ దేశం తీవ్ర ఆహార కొరతతో ఇబ్బంది పడుతోంది. అటు అగ్ర రాజ్యం అమెరికా కూడా సాయం చేసే విషయంలో చేతులెత్తేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది భారత సర్కార్. ఏకంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను తక్షణ సాయం కింద ఆఫ్ఘాన్లకు ఐక్య రాజ్య సమితి ద్వారా అందించేందుకు ఓకే చెప్పింది. మొదటి నుంచి పాకిస్తాన్ కంటే భారత్ సాయం మేలని తాలిబన్లు భావిస్తున్నారు. అందుకే చాలా విషయాల్లో భారత్ వైపు మొగ్గు చూపేందుకు రెడీ అయ్యారు తాలిబన్లు. ఇప్పటికే అధికారికంగా రెండు సార్లు చర్చలు కూడా జరిపారు. ఆఫ్ఘాన్లకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా సాయం చేయాలని భారత్ను తాలిబన్లు కోరారు.