గత కొన్ని నెలల క్రితం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట కవిత బెయిల్ పైన ఇప్పటికి విచారణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా బీహార్ జైలులో ఈమె ప్రస్తుతం ఉంటోంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుని సైతం ఆశ్రయించారు.. ముఖ్యంగా ఈ ఢిల్లీ మద్యం కేసులో ఈడి, సిబిఐలు కవిత పైన నమోదు చేసినటువంటి అభియోగాలన్నీ కూడా తనమీద చేసినటువంటి కుట్రపూరితమైనవని కేవలం తనమీద తప్పుడు కేసులు ఆరోపించారని కల్వకుంట కవిత మెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రయత్నించారు.


నిన్నటి రోజున 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారట. అయితే కింది కోర్టులో న్యాయం జరగకపోవడంతో ఆమె ఏకంగా హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ పిటీషన్ సైతం విచారణ స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత శర్మ ఈ రోజున ఒక విచారణ చేపట్టడం జరిగింది. అయితే అనంతరం ఈ విచారణను ఈనెల 24 న వాయిదా వేయడం జరిగిందట.. కవితా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన ఎన్నో రకాల వాదనలు విడిపించడానికి ఈడి కాస్త సమయం కావాలంటూ కోరడం జరిగిందట.


దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ ఈనెల 24 కి వాయిదా వేసింది.. కల్వకుంట కవిత ఈ ఏడాది మార్చి 15న ఈడి అరెస్టు చేశారు.. అప్పటినుంచి ఈమె బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా మరింత ఆలస్యం అవుతూనే ఉంది.. అలా ఆమె కుటుంబ సభ్యులతోపాటు బీఆర్ఎస్ శ్రేణులలో కూడా ఈ విషయం తీవ్ర నిరాశను గురైలా చేస్తోంది. కవిత బెయిల్ విషయం పైన  బిఆర్ఎస్ నేతలకు షాక్కు గురయ్యాలా చేస్తోంది..ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈమెను ఏప్రిల్ 11న అరెస్టు చేయడం జరిగింది.. ప్రస్తుతం కల్వకుంట కవిత తీహార్ జైలులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: