
ఈ టాస్క్ఫోర్స్ ఆర్థిక వృద్ధి మార్గాలను గుర్తించడం, మౌలిక సదుపాయాల లోటును అంచనా వేయడం, పెట్టుబడి అవసరాలను విశ్లేషించడం, విధాన సంస్కరణలను సూచించడంపై దృష్టి సారించింది. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా, రాష్ట్రం సున్నా పేదరికం, ఉపాధి, నీటి భద్రత, ఆగ్రి-టెక్, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్ వంటి పది ముఖ్య సూత్రాలపై పనిచేస్తోంది. ఈ నివేదికలో పరిశ్రమలకు 12 నుంచి 44 శాతం వరకు సబ్సిడీలు, డీకార్బనైజేషన్కు 6 శాతం సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలు ప్రతిపాదించబడ్డాయి.
అమరావతిలో సీఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు ఉన్నాయి.సీఐఐ కార్యక్రమంలో చంద్రబాబు ప్రత్యేకంగా సభ్యులతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు మార్గం సుగమం చేయడం గురించి చర్చించనున్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వంటి కీలక ప్రతిపాదనలు ఈ నివేదికలో ఉన్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు