చత్తీస్ఘడ్ రాష్ట్రం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ కానిస్టేబుల్ ను  దారుణంగా కాల్చి చంపారు. ఆయుధాలతో ఉన్న కొంతమంది మావోయిస్టులు రాత్రి కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. 


 మావోయిస్టుల దాడిలో చనిపోయిన సదరు కానిస్టేబుల్ జాంగ్లా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చాడు సదరు కానిస్టేబుల్. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అతన్ని  కాల్చి చంపారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులపై కూడా దారుణంగా దాడికి దిగారు మావోయిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి: