తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన సమంత ప్రస్తుతం తీరికలేకుండా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంటోంది .సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల కొటేషన్స్ ను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే ఇందుకుగాను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది సమంత. అయితే ఇప్పుడు ఈ జబ్బు తగ్గినట్టేనా లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుందా అనే విషయం అభిమానులను సందేహంగానే మిగిలిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగచైతన్య తో విడిపోయిన తర్వాత తెగ వైరల్ గా మారింది సమంత.. తనకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్టు చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే తన శరీరాన్ని శక్తి లేకుండా చేస్తున్న ఇలాంటి వ్యాధి 100 మందిలో ఐదారు మందికి వచ్చే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదని తెలుసింది..కానీ నీ ప్రేమ ఉంటే చాలు నేను త్వరగా కోలుకుంటాను అంటూ సమంత గతంలో తెలియజేయడం జరిగింది. అయితే అప్పుడు అలా చెప్పిన సమంత ఇప్పుడు కోలుకున్నట్టేగా వార్తలు వినిపిస్తున్నాయి.


కానీ మయోసైటీస్ నుంచి సమంత కోలుకోలేదని కేవలం మందులు వాడినంతవరకు..IVIG ఇంట్రావిసన్ ఇమ్యునోగ్లోబలిన్ థెరపీ చేశానుకు అటెండ్ అవుతున్నంతవరకు సమంత ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేవట. దీనివల్ల మయోస్సైటిస్ కూడా ఏం చేయలేదని తెలుస్తోంది.అందుకే సమంత కూడా కాస్త తన లైఫ్ స్టైల్ ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.సరైన సమయంలో IVIG మెడిసిన్ ని తీసుకుంటూ యోగ మెడిటేషన్ వంటివి చేస్తూ మధ్యలో ఫిట్నెస్ కోసం పలు వర్కౌట్లు కూడా చేస్తూనే ఉంది.ముఖ్యంగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తను కమిట్ అయిన చిత్రాలను పూర్తిచేసే పనిలో పడింది సమంత. ప్రస్తుతం సమంత గురించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: