సినీ నటి రష్మిక మందన్న తాజాగా ట్రెడిషనల్ లుక్ లో తళుక్కుమంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో సాంప్రదాయ దుస్తుల్లో తీసుకున్న ఫొటోస్ ని షేర్ చేసింది. అందులో రష్మిక పసుపు రంగు చీరలో మెరిసిపోయింది. చేతికి గాజులు వేసుకొని, నుదుటిన సింధూరం పెట్టుకొని తెలుగింటి అమ్మాయిల కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ కనులకు విందుగా ఉంది అంటుంటే.. మరికొందరేమో సాంప్రదాయ దుస్తులను శ్రీవల్లీ ఎంత బాగుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
 
రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.


ఇప్పుడు రష్మిక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ అందాల భామ రణబీర్ కపూర్ తో కలిసిన నటించిన యనిమాల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ఛావా సినిమాలో నటించింది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: