అయితే పర్సనల్ లైఫ్లో ఇంత ఆనందం నిండుతున్నా, ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం రామ్ చరణ్కు చిన్న సవాల్ ఎదురైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్— పెద్ది. వచ్చే ఏడాది మార్చి 27, చరణ్ బర్త్డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేయాలని ముందుగా అంగీకరించాడు.కానీ ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెన్సీ కారణంగా ఆ ప్రాజెక్ట్పై మార్పులు రావచ్చని ఇండస్ట్రీ టాక్. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఉపాసన మార్చి నెలలోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాక, ట్విన్స్ పుట్టబోతున్న నేపథ్యంలో చరణ్ కొంతకాలం పాటు తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. “ఈ సారి కూడా షూటింగ్లు, ప్రొమోషన్స్ మధ్య ఫ్యామిలీని మిస్ కాకూడదని” చరణ్ ఆలోచిస్తున్నాడని సమాచారం.
ఇదే కారణంగా ఆయన సుకుమార్ ప్రాజెక్ట్ నుండి తాత్కాలికంగా తప్పుకోవాల్సి వస్తోందట. అంతేకాదు, చరణ్ దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక సుకుమార్ విషయానికి వస్తే, ఆయన “పుష్ప 2” పూర్తయ్యాక వెంటనే చరణ్తో సినిమా చేయాలని భావించాడు. కానీ చరణ్ గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడు సుకుమార్ మరో హీరోను ఆలోచిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నాడట.ఇప్పటివరకు సుకుమార్–ప్రభాస్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడూ రాలేదు. కనుక ఈ కాంబో కుదిరితే ఇండస్ట్రీలో భారీ హైప్ ఏర్పడుతుంది. మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నప్పటికీ, “సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్తో పని చేయాలనే ఆసక్తి ఉందని” ఆయనకు దగ్గర వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా, సోషల్ మీడియాలో చరణ్ వదిలేసిన ఈ ప్రాజెక్ట్లో ఎవరు బెస్ట్గా సూట్ అవుతారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతుండగా, మరికొందరు “ప్రభాస్ కే బెటర్ ఫిట్” అంటున్నారు.అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. రామ్ చరణ్ గానీ, సుకుమార్ గానీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక సుకుమార్ ఎవరి తో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తాడో చూడాలి — అది ప్రభాస్ అవుతాడా, లేక ఎన్టీఆర్ అవుతాడా అన్నది టాలీవుడ్ మొత్తానికి ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి