విజయనగరం జిల్లాలో సంచయిత చేస్తున్న రాజకీయానికి ప్రత్యర్థులకు మతిపోతుంది. టిడిపి సీనియర్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కే రాజకీయంగా చెక్ పెట్టే విధంగా సంచయిత వ్యవహరిస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ హయాంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగాడు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర మంత్రి గా వ్యవహరిస్తూ ఉత్తరాది రాజకీయాల్లోనే మంచి పేరు సంపాదించారు. పైగా పూసపాటి రాచ కుటుంబానికి చెందిన వాళ్లు కావటంతో తిరుగులేని నేతగా మొన్నటి వరకు ఎదిగారు.

 

చంద్రబాబు హయం లో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు…  జగన్ కి దిమ్మతిరిగిపోయే విధంగా ఆ సమయంలో ముప్పుతిప్పలు పెట్టినట్లు రాజకీయాల్లో టాక్. జగన్ పాదయాత్ర టైములో…,  జగన్ నడుస్తున్న ప్రదేశాలలో కరెంటు తీసేసి అనేక ఇబ్బందులకు అశోక్ గజపతిరాజు అప్పట్లో గురిచేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రావడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే ఈ విధంగా వేస్తున్న సీట్లలో అశోక్ గజపతిరాజు కి సొంత అన్న కూతురు ఆనందగజపతిరాజు కుమార్తె సంచయిత ద్వారా చెక్ పెట్టడం జరిగిందట.

 

దీంతో అధికార పార్టీ అండగా ఉండటంతో సంచయిత చేస్తున్న రాజకీయానికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చాలా చిన్న పిల్ల ఏం చేస్తుంది అని లైట్ గా తీసుకున్న వారికి విజయనగరం పాలిటిక్స్ లో నిద్రలేకుండా సంచయిత చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈమె తన సెక్రెటరీ గా చెన్నై రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి నియమించుకోవడం జరిగిందట. సదరు వ్యక్తి ఇటీవల జిల్లాలో అడుగుపెట్టడంతో వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మరికొంతమంది పెద్దలు ఆ వ్యక్తి మొదట కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుని జిల్లాలో అడుగుపెట్టాలని లేకపోతే అడ్డుకుంటామని అన్నారట.

 

సంచయిత రంగంలోకి దిగి అతని డైరెక్ట్ గా ఇంటికి తీసుకువెళ్లి, లోనే కూర్చోబెట్టి అన్ని పరీక్షలు చేయించి కనీసం క్వారంటైన్ కి కూడా వెళ్ళనీయకుండా తనదైన శైలిలో రాజకీయం చేసిందట. ఈ సమయంలో అత్యుత్సాహం చేసిన టిడిపి శ్రేణుల ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టిందట. సంచయిత ఈ విధంగా వ్యవహరించడంతో ప్రత్యర్థులకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: