
“ఎన్నాళ్లుగానో పార్టీ కోసం కష్టపడుతున్న మన కేడర్ను వదిలేసి, జంపింగ్ లీడర్లకు పదవులు ఇస్తే, కార్యకర్తల్లో అసంతృప్తి రేగిపోతుంది. అంతేకాకుండా, వీరిలో కొందరు కోవర్టుల్లా వ్యవహరించి, కీలక విషయాలు వైసీపీకి లీక్ చేసే ప్రమాదం ఉంది” అంటూ సీనియర్లు బలమైన వాదనలు వినిపిస్తున్నారట. దీంతో ప్రస్తుతానికి ఈ కొత్తగా చేరిన నేతలకు పార్లమెంటరీ కమిటీల్లో అసలు ఛాన్స్ ఇవ్వలేదని సమాచారం. పార్టీ మారి వచ్చినవారు చాలామంది పదవుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండటం తెలిసిందే. వీరికి ఎటువంటి హోదా ఇవ్వకపోతే తిరిగి వాళ్లు పార్టీకి తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని కూడా మరో వర్గం హెచ్చరిస్తోంది. “ఒకవైపు వారిని ఉపయోగించుకోవాలి, మరోవైపు కేడర్ను కాపాడుకోవాలి” అనే క్లిష్టమైన స్థితిలో చంద్రబాబు నిలిచినట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీల జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా అధికారికంగా బయట పెట్టకపోవడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు. పార్టీ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం, జిల్లా స్థాయిలో పేర్లు ఖరారైనా, రాష్ట్ర స్థాయి నేతృత్వం ఇంకా నిర్ణయించాల్సి ఉందట. మొత్తానికి, టిడిపి పార్లమెంటరీ కమిటీల్లో జంపింగ్ లీడర్లకు అవకాశం ఇస్తారా, లేక వారిని పక్కన పెట్టేస్తారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు తీసుకోబోయే ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో టిడిపి భవిష్యత్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.