
ఈ క్రమంలోనే ఇక ముగింపు వేడుకల కోసం ఖర్చు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే సెలబ్రిటీలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. ప్రముఖ రాపర్ కింగ్, డీజే న్యూక్లియ, సింగర్లు డివైన్, జ్యూనిత గాంధీ లు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారట.
సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయ్ అని చెప్పాలి. ఇక ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. ఇకపోతే ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా ఉంది. అంతేకాదు నాలుగు సార్లు టైటిల్ విజేతగా కూడా కొనసాగుతుంది. మరోవైపు గుజరాత్ జట్టు గత ఏడాది ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. వరుసగా రెండోసారి ఫైనల్ అడుగుపెట్టింది. ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.