ప్రపంచంలో ప్రతిఒక్క మనిషికి డబ్బు అంటే లక్ష్మీదేవి పైన ఆశ ఉంటుంది. అయితే కొంతమంది వారికి కావలసిన డబ్బు ఉంటే చాలనుకుంటారు. ఇంకొంతమంది ఎంత డబ్బున్నా సరిపోక ఇంకా కావాలనే అత్యాశతో డబ్బు వెనుక పరుగులు తీస్తూ ఉంటారు. అయితే ఎవరిదగ్గర పడితే వారి దగ్గర డబ్బు ఉండడం జరిగే పని కాదు. దీనికి సాక్ష్యాత్తు లక్ష్మి దేవి కటాక్షం కావాలి. ఆమె కరుణిస్తేనే మనకు రూపాయి అయినా కనబడుతుంది. ఆమె ఆగ్రహించిందంటే డబ్బు కరువులో కొట్టుకుపోతాము. అయితే ఇటువంటి డబ్బును పొందాలంటే లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలేంటో మన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము. శ్రీమహాలక్ష్మీ మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.

లక్ష్మీ దేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్లాపాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న మంచి రోజులు ఎప్పుడు వస్తాయనేది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తో తీవ్ర ఆందోళనతో చెందుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే దుకాణాలు, ఇతరత్రా సౌకర్యాలు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. త్వరలోనే దేవుడి దయ వల్ల అంతా మునపటిలా మారబోతుందని భావిస్తున్నారు.

లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగ-ద్వేషాలు, ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు. ఇంట్లో మనస్పర్థలు, విబేధాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: