ఇటీవల కాలంలో ఇస్రోకి ఇది మరో ఎ దురు దెబ్బ. శ్రీహరికోట షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఎస్.ఎస్.ఎల్.వి.డి-1 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్ ద్వారా రెండు శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెట్టాలని చూసినా అది సాధ్యపడలేదు. ఈ ప్రయోగం విఫలం కావడంతో ఆ రెండు శాటిలైట్లు కూడా విఫలం అయినట్టు తేలిపోయింది. విచిత్రం ఏంటంటే.. రాకెట్ ప్రయోగంలో మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. ఆ తర్వాత చివరి స్టేజ్ లో మాత్రం ఉపగ్రహాలతో లింక్ తెగిపోయింది. ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు ఉన్న సంబంధాలు కట్ అయిపోయాయి. దీంతో ఆ ఉపగ్రహాలు ఎక్కడున్నాయనే విషయం తేలకుండా పోయింది. ఉపగ్రహాలను రాకెట్ సరిగ్గా కక్ష్యలో ప్రవేస పెట్టిందా, లేక అవి నిరుపయోగంగా మారిపోయాయా అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్య లోకి చేరిన తర్వాత వాటినుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం విచిత్రం. చివరి దశలో ప్రయోగం విఫలం అయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రయోగం విఫలం అయినట్టు ఇస్రో కూడా అధికారికంగా ధృవీకరించింది. తాము అనుకున్న కక్ష్యలో శాటిలైట్లను ప్రవేశ పెట్టలేకపోయామని, మరో కక్ష్యలో వాటిని ప్రవేశ పెట్టడం వల్ల గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీంతో ఈ ప్రయోగం ద్వారా చిన్న శాటిలైట్లను చిన్న రాకెట్ ద్వారా నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశ పెట్టి రికార్డ్ సృష్టించాలనుకున్న ఇస్రోకు చేదు అనుభవం ఎదురైనట్టయింది.  ఈ వైఫల్యానికి కారణాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

విద్యార్థుల శ్రమకు దక్కని ఫలితం..
భూ పరిశీలనకు ఉపయోగించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థులు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతరిక్షంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ శాలిలైట్ ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇక దీనితోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన మరో శాటిలైట్ పేరు ఆజాదీ శాట్. దీన్ని భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 750 మంది పాఠశాల విద్యార్థులు రూపొందించారు. అయితే తొలిసారిగా జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ కాకుండా ఎస్ఎస్ఎల్వీ ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టేందుకు ఇస్రో ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం ఇలా వికటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: