
ఆటిజం అనగా బుద్ధిమాంద్యత. ఈ ఆటిజం వచ్చిన పిల్లల్లో అవయవాలు అన్ని సరిగా పని చేసినప్పటికీ బుద్ధిహీనతను కలిగి ఉంటారు.ఆటిజం సమస్యకు మందు లేదు కానీ ఉన్నదంతా మానసిక, శారీరక ధైర్యమే. బుద్ధిమాంద్యత వచ్చిన పిల్లల్లో అవయవాలు అన్నీ సరిగా పనిచేసినా, ఒక మామూలు మనిషికి ఉన్న సాధారణ తెలివి తేటలు కూడా లేనప్పుడు ప్రయోజనం ఏముంటుంది. ఇక తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని చూస్తూ ఎంతో విలవిలలాడిపోతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడో వందలో ఒకరు మాత్రమే ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు ఉంటారు. ఇందుకు ముఖ్యంగా కావలసిన వైద్యం ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ వల్ల చిన్న పిల్లలు తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇందుకు కావలసిన ఖర్చును భరించలేని స్థితిలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు.


నిజానికి ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు కోటి మంది చిన్నారులు ఈ ఆటిజం సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకొని వారందరికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ సంస్థ సేవలను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు, బెంగళూరు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల చిన్నారులకు కూడా చేరువ చేశారు. ఇక ఈమె ఈ సేవలను కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర దేశాల చిన్నారులకు కూడా సేవలు చేయాలని ఈమె సంకల్పించారు. ఇక అనుకున్నదే తమ సేవలను అమెరికా, కువైట్, ఖతార్, లండన్ వాసులు కూడా పొందుతున్నారు. ఇలా చిన్నారుల సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపుతున్న శ్రీజారెడ్డి సేవకు నిదర్శనంగా పిలుస్తున్నారు. ఆటిజం ఉన్న పిల్లలు ఈ సంస్థ ద్వారా ఉచితంగా సేవలను పొందవచ్చు. ఇక ఈ సమస్యలను అధిగమిస్తూ, చిన్నపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ సరిలేరు నాకెవరు అంటూ నిరూపించుకుంటున్నారు శ్రీజ రెడ్డి సరిపల్లి.

