విజయవాడ ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని  తల్లి తండ్రులు సిఎం వైఎస్ జగన్ ను కలిసారు. ఈ సందర్భంగా జగన్  వద్ద వారు తమ ఆవేదన వ్యక్తం చేసారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తో కలిసి వెళ్లి సిఎం జగన్ ను వారు కలిసారు. దివ్య ఫ్యామిలీకి సిఎం జగన్ పది లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. తమకు న్యాయం జరగాలని వారు సిఎం జగన్ ని కోరారు. హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా సిఎం జగన్ ని కలిసారు. కాగా నిందితుడు నాగేంద్ర బాబు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దిశా పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సిఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: