
ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారి దగ్గర కలెక్షన్లు వసూలు చేసి రేపు స్థానిక ఎన్నికల్లోనూ వారికే సీట్లు .. టిక్కెట్లు .. పదవులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో లోకల్ కేడర్ ఐదేళ్ల పాటు ఏ వైసీపీ నాయకులతో పోరాటాలు చేశారో .. రేపు మళ్లీ వారి కిందే పని చేయాల్సిన దుస్థితి ఎదుర్కోక తప్పదు. వైసీపీ హయాంలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఘోరంగా జరిగాయి. వాటిని ఎన్నికలు అనడం కన్నా రిగ్గింగ్ అనడం బెటర్. టీడీపీకి దర్శి, తాడిపత్రి మున్సిపాల్టీల్లో తప్ప ఎక్కడా విజయం దక్కలేదు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవులు టీడీపీ చేతిలో లేకపోయినా .. ప్రభుత్వం లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ టీడీపీ ఈ కక్కుర్తి పనులకు పోతే అంతిమంగా పార్టీ కేడర్ ఇబ్బందుల పాలయ్యి .. పార్టీకే నష్టం జరుగుతుంది.
పిరాయింపుల వల్ల పార్టీ కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు వచ్చే లోకల్ ఎన్నికల్లో టిక్కెట్లు దొరకడం గగనంగా మారుతుంది. అందుకే మున్సిపల్ ఫిరాయింపులను కూటమి పార్టీలు ప్రోత్సహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు