బంగారం, వెండి ధరలతో గేమ్స్ ఆడుతున్నారు. జనం యొక్క అవసరాన్ని ఒక బిజినెస్ గా మార్చుకొని మరి గేమ్స్ ఆడుతున్నారు. ఏదైతే హర్షత్ మెహతా కనుక షేర్లు మార్కెట్లో.. టెంప్ట్ చేసి మరి ఆ రోజుల్లో నడిపారో అట్లాంటి కుంభకోణమే ఇప్పుడు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్లో మొన్నటిదాకా బంగారం లక్షదాటి పోయిందని.. లక్షన్నర దాకా వెళ్ళిపోతుందంటూ బడా బడ సంస్థలు ప్రచారం చేశారు. ఇది చాలా ఓవర్గా మారిపోయింది. దీని పర్యవసానం బంగారం కొనుగోలు చేసే వాళ్ళు కూడా  ఒక్కసారిగా తగ్గిపోయారు.


దీంతో బంగారం కూడా కొనాలంటే చాలామంది మక్కువ చూపడం లేదు. దీంతో తగ్గించేటువంటి చర్యలు తప్పడం లేదు.. నిన్న మళ్ళీ 99 వేల నుంచి ఇవాళ 96 వేలకు 24 క్యారెట్ల బంగారం  పడిపోయింది. అయితే ఇదే సందర్భంలో వెండిని ఇప్పుడు అకస్మాత్తుగా పెంచినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 3106 రూపాయలు ఇవాళ ఒక్క రోజులోనే పెంచేశారు. కానీ ఇలా పెంచడం గనక ఒక మాఫియా ఉందన్నట్లుగా వినిపిస్తున్నాయి. బంగారం అయితే కనుక రేటు పరంగా 100 కి 90 రూపాయలు 95 రూపాయలు మనం అమ్ముకుంటే వస్తాయి.


అదే వెండికి వచ్చేసరికి 100 కి.. 70 లేదా 80 రూపాయలు మాత్రమే వస్తుంది మనం అమ్ముకున్నప్పుడు. పోనీ వెండి నగలని ఏమన్నా ఎక్కువగా  ఇస్తారా అంటే లేదు.. కేవలం ఇంట్లో కొన్ని వాటినే వెండి సామాన్లుగా ఉపయోగిస్తాము. అయితే ఇప్పుడు అలాంటి వెండి అకస్మాత్తుగా కృత్రిమమైనటువంటి ధర హైక్ సృష్టించారు.. టోటల్గా వెండి చరిత్రలోనే లేనంతగా.. లక్ష 14 వేల రూపాయలు కమ్యూనిటీ ధర భారీగా పెంచి పడేశారు.. ప్రస్తుతం ఎలాంటి డిమాండ్ లేకున్నా కూడా ఇలాంటి అడ్డగోళ్లు రేట్ల వల్ల పెంచేస్తున్నారు.. దీంతో ఆ తర్వాత పతనం కాక తప్పదు అంటూ చాలామంది విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: