అయితే త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్త మరోసారి ఆటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ ను మనం గతంలో విన్నాం కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. తాజాగా `త్రిష మ్యారేజ్` న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతోంది. దీనికి కారణంగా కూడా ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
చెన్నై సుందరి కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఫిట్నెస్ని మెయింటేన్ చేస్తున్న త్రిష.... ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగుతుంది. ఆమె చేతిలో ఇప్పుడు `పొన్నియిన్ సెల్వన్`, `చదురంగ వేట్టై-2`, `రాంగీ`, `గర్జనై` వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క `పొన్నియిన్ సెల్వన్` మినహా మిగిలిన చిత్రాల షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పొన్నియిన్ సెల్వన్` లోని తన షూర్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
చేతిలో పొన్నియన్ తప్ప మరో ఫిలింకు త్రిష కమిట్ కాకపోవడంతో కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాంటెడ్ గానే మరో ప్రాజెక్ట్ కు కమిట్ కాకుండా త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని, అందుకే ఆమె కొత్త ప్రాజె క్టులను అంగీకరించడం లేదనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని త్రిష ఫ్రెండ్ సర్కిల్ కూడా చెబుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే త్రిష స్పందించాల్సిందే. గతంలో త్రిష.. వరుణ్ మణియన్ అనే బిజినెస్మేన్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఏం జరిగిందో ఏమో దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష ఒంటరిగానే ఉంటోంది. శింబుతో ప్రేమాయణం నడిపించిందంటూ వార్తలొచ్చాయి. వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.