రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 27 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా యొక్క కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా యొక్క మొత్తం కర్ణాటక రైట్స్ ను "కే వీ ఎన్" ప్రొడక్షన్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇకపోతే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: