
ఏ హీరో అయినా సరే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. ఎన్ని కమిట్మెంట్లు ఉన్నా సరే ..కనీసం నెలకు ఒక్కసారైనా ..ఒక్క సండే అయినా సరే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని టైమ్ స్పెండ్ చేయాలి . మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దూరంగా పెట్టేయాలి. కేవలం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మనసుకు ప్రశాంతంగా ఉండే మాటలనే మాట్లాడుకోవాలి అంటూ ఒక రూల్ ని తీసుకొచ్చారట . ఈ రూల్ ని ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీ పాటిస్తూనే వస్తుంది . దీంతో చిరంజీవి చేసిన పని చాలా బాగుంది అంటున్నారు జనాలు .
అంతేకాదు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో భార్య భర్తలు కూడా టైం స్పెండ్ చేయాలనే అంత బిజీ అయిపోతుంది. సరదాగా కాసేపు కూర్చున్న చేతిలో మొబైల్ ఫోన్లో పట్టుకొని ఏదో ఒక రీల్స్ , షాట్స్ చూస్తున్నారు . మనసు విప్పి మాట్లాడుకోవడమే మానేస్తున్నారు . తద్వారా బంధుత్వాలు కూడా తెగిపోతున్నాయి. ఆ కారణంగానే చిరంజీవి ఈ విధంగా చేసుంటాడేమో అని కూడా మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి ఏ కారణం చేత ఈ నిర్ణయం తీసుకున్న అంతా మంచికే అంటూ జనాలు పొగిడేస్తున్నారు. చిరంజీవి ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బిజీగా ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తుంది..!!