
ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ కొరత ఎందుకు ఏర్పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది వ్యాపారులు సబ్సిడీపై అందుబాటులో ఉన్న యూరియాను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నారని, అందుకే రైతులకు అందడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు సకాలంలో స్పందించి, రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, అక్రమ నిల్వలు, దారి మళ్లింపులను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ యూరియా కొరత వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు