* కరోనా మూడవ దశ వచ్చే చాన్స్ ఉండడంతో ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కు పంపుతారో తెలియాల్సి ఉంది.
* ఎవరైతే పేరెంట్స్ స్కూల్ కు పంపుతారో వారు ఖచ్చితంగా పిల్లలకు కరోనా పట్ల పాటించాల్సిన జాగ్రత్తలను అర్థమయ్యేలా తెలియచేయాలి.
* ఇంటి నుండి స్కూల్ కి బయలుదేరే ముందు మాస్క్ ను ఎలా ధరించాలో నేర్పించి, ఎటువంటి పరిస్థితుల్లో మస్కును తీయకూడదని వారికి చెప్పాలి.
* పేరెంట్స్ పిల్లలకు శానిటైజర్ ను అప్లై చేసి పంపించాలి. అంతే కాకుండా స్కూల్ దగ్గరా కూడా బాత్ రూం కి వెళ్ళినా, లంచ్ చేసినా ఎవరి వస్తులనైనా ముట్టుకున్నా శానిటైజర్ ను అప్లై చెయ్యాలని అవగాహన కలిగించాలి.
* అదే విధంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలియచేయాలి.
* మీరే స్వయంగా స్కూల్ దగ్గరకు వెళ్ళి ఉపాధ్యాయులకు మీ పిల్లలను జాగ్రత్తగా చూడమని చెప్పాలి.
* పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వారికి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా అని గమనించాలి. అలాగే వారి క్లాస్ లో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా లేదా అని అడగాలి. ఒకవేళ ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే ముందుగానే వారిని గుర్తించి నయం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా పిల్లల తల్లితండ్రులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను స్కూల్ కు పంపాలి. ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది. కావున ఎటువంటి నిర్లక్ష్యాన్ని వ్యవహరించవద్దు.