దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ ఎలా అయినా క్లోజ్ చేయాలని చూస్తోంది. ఇక ఈ రోజు కడపకు సీబీఐ బృందం కొత్త పర్యవేక్షణ ఐపీఎస్ అధికారి రామ్ కుమార్ చేరుకోనున్నారు.


 వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కై రామ్ కుమార్ ఐపిఎస్ సారధ్యంలో నేటి నుంచి సీబీఐ బృందం రంగంలోకి దిగనుంది. ఇక పై వివేకా హత్య కేసు విచారణ కొత్త మలుపు తిరగనున్నట్టు భావిస్తున్నారు. వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలం నేపథ్యంలో కొందరు కీలక వ్యక్తులను విచారిస్తారని సమాచారం అందుతోంది. పులివెందుల ప్రాంతంలో ని అనుమానితుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి ఈరోజు నుంచి జరిగే విచారణలో ఏం క్లారిటీ వస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: