అలాగే వారి కాంబోలో వచ్చిన మరో సినిమా ఖలేజా. 2010 లో విడుదుల అయిన ఖలేజా సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనుష్క శెట్టి హిరొయిన్గా నటించారు. ఆ రోజుల్లో మంచి టాక్ రాకున్న ఇప్పుడు టీవీలల్లో వస్తే ఆ ఛానల్ టీఆర్ పీ పంటే అని చెప్పాలి. కొన్ని సందర్భాలల్లో టీఆర్ పీ రేటింగ్స్ కోసమే ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేసేవాళ్లు. ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రంగారు డైలాగ్స్ కూడా ఆయనే రాశారు. ఈ సినిమా హైలేట్ డైలాగ్సే. వీరి కాంబొలో వస్తున్న మూడో చిత్రం కావడంలో ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపొయాయి. ఈ సినిమాకు టైటీల్ ను ఫిక్స్ చేయాల్సి ఉంది. దీనికి మ్యూసిక్ డైరెక్టర్గా థమన్ , హిరోయిన్గా పూజహెగ్డేను ఫైనల్ చేసారని సమాచారం.
డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ గారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబో లో వస్తున్న మల్టీస్టారర్ సినిమాకు వ్రైటర్గా చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయా సినిమా షూటింగ్ ల తర్వాత వీరి సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. మాటల మంత్రికుడు, సూపర్ స్టార్ కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు పెరిగిపొతున్నాయి. వీరి మూడో సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.