తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( MAA) లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి . మా లో ఎవరు గెలుస్తారా అని  ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ఈసారి జరగబోవటం విశేషం. ఇప్పటికే మా కొరకు ప్రకాష్ రాజ్ ప్యానల్. మంచు విష్ణు ప్యానల్ లు గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇరు  ప్యానళ్లు  ఇప్పటికే తమ శక్తి బలాలను కూడగట్టుకుని ఉన్నాయి. ఈ ఎన్నికలపై పలువురు సీనియర్ నటులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. తాజాగా నటి, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆర్ కే రోజా స్పందించారు.


మా ఎన్నికల్లో పాల్గొని తప్పకుండా ఓటు వేస్తానని స్పష్టం చేశారు. ఇరు పానెల్స్ తమ మేనిఫెస్టో ని విడుదల చేశాయని. మూవీ ఆర్టిస్టులకు అవసరమయ్యే, సరిపోయే మేనిఫెస్టో కే ఓటు వేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. లోకల్ నాన్ లోకల్ వివాదం పై తన ప్రతిస్పందనను అడిగినప్పుడు.. ఈ విషయమై ఎలాంటి కాంట్రవర్సి లోకి లాగవద్దని చెప్పారు. అదేవిధంగా మా ఎన్నికలలో వేలు పెట్టబోనని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. కానీ మంచు మోహన్ బాబు వైఎస్ఆర్సి పి లో చేరడం.



రోజా కూడా అదే పార్టీలో ఉండడం మంచు విష్ణు కి కలిసొస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే రోజా మాత్రం ఏ ప్యానల్ కు ఓటు వేస్తారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే మంచు విష్ణు కి నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఓటు వేస్తారని అందరూ ఊహిస్తారు . అయితే ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అండ దండలు ఉన ప్యానెల్స్ గెలవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఈసారి మెగా ఫ్యామిలీ ఎటువైపు మొగ్గు  చూపిస్తుందో చూడాలి. మా అసోసియేషన్ లో దాదాపు 1400 పైచిలుకు ఓట్లు ఉండడం విశేషం. ఈ ఓట్లు ఎవరికీ లాభిస్తాయో   చూడవలసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: