మాస్
రాజా రవితేజ హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇతర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన ఈ విధంగా దూసుకుపోతున్నాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న కిలాడి
సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఫిబ్రవరి తర్వాతనే ఈ
సినిమా విడుదల కాబోతుంది అనే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అయన
హీరో గా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో
హీరో గా చేస్తుండగా ధమాకా
సినిమా కూడా అయన చేస్తుండడం విశేషం. ఈ మూడు సినిమాలే కాకుండా అయన ఇప్పుడు మరో
సినిమా ను కూడా ఒప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఇక రవితేజను కథాపరంగా ఒప్పించడం ఒక ఎత్తు అయితే మరో విధంగా ఆయనను సినిమాకు పించవచ్చు అని ఇప్పుడు పుకార్లు కొన్ని వినబడుతున్నాయి. ఆయనకు రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే తప్పకుండా ఆ సినిమాను ఒప్పుకుంటాడు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. దీనికి గతంలో జరిగిన ఓ ఘటన కూడా వూతం గా మారింది. వాస్తవానికి
మారుతి గోపీచంద్ తో కలిసి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాకి హీరోగా
రవితేజ చేయాల్సి ఉంది.
కానీ రెమ్యునరేషన్ విషయంలో
రవితేజ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోవడంతో
మారుతి తన సినిమాను వేరే హీరోతో చేయవలసి వచ్చింది.
రవితేజ కూడా తనకు రెమ్యునరేషన్ బాగా ఇచ్చే నిర్మాతలతో ముందుకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం కాగా ఇప్పుడు ఆయన తాజాగా చేస్తున్న సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట రవితేజ. ఇటీవలే ఆయన రెండు సినిమాలను ఒప్పుకోగా వాటికి ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు ఒక్కసారిగా
టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా దొంగాట వంశీకృష్ణ డైరెక్షన్ లో ఆయన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేయబోతున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అంతే పారితోషకం తీసుకుంటున్నాడట.