ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో వేడి అంతకంతకూ రాజుకుంటోంది. అయితే మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ స్నేహితులుగానే ఉన్నారు.  ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ సరదా సరదాగా గడిపారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు సిసలైన ఆటలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు అన్నది అర్ధమవుతుంది. అయితే ఇటీవలే 9వ వారం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నా విశ్వ ఎలిమినేట్ అవ్వడం హౌస్ లో ఉన్న సభ్యులందరిలో కూడా మార్పు తీసుకువచ్చింది.


 మొన్నటివరకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో బాగా ఆడితే ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపిస్తారు అని అనుకున్నారు హౌస్ లో ఉన్న సభ్యులు. కానీ బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతి టాస్కులో  కూడా అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి.. ఇక బిగ్ బాస్ హౌస్ లో ది బెస్ట్ అనిపించుకున్న విశ్వ ఎలిమినేషన్ తర్వాత... కేవలం టాస్క్ లో బాగా ఆడితే సరిపోదని ప్రతిక్షణం గేమ్ లోనే ఉండాలి అన్నది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులు అర్థం చేసుకున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటివరకు స్నేహితులుగా ఉన్న షన్ను, siri మధ్య గొడవలు జరగ్గా.. ఇక ఇప్పుడు జెస్సి, షణ్ముక్ మధ్య కూడా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.


 అదే సమయంలో మానస్, ప్రియాంక మధ్య కూడ కాస్త గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఇంటి సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు సోలోగా ఆడేందుకు సిద్దమై పోయారు. దీంతో బిగ్ బాస్ హౌస్హౌస్ లో అసలు సిసలైన వేడి రాజుకుంది అని ప్రోమో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్బిగ్ బాస్ షో చివరి రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఆ మాత్రం వేడి ఉండడం కామన్ అని అంటున్నారు మరికొంతమంది. ఇప్పటికే ఇటీవలే నామినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ మధ్య వేడి రాజుకుంది. ఇక రానున్న రోజుల్లోబిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో కంటెస్టెంట్స్ ఎలా ఆడబోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: