ఈ మధ్య కాలంలో మనం చాలానే చూస్తున్నాం. చాలా వరకు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఐటమ్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా సగం హిట్ అయినట్లుగా దర్శక నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. గతంలో చిన్న చిన్న హీరోయిన్లు మాత్రమే ఐటమ్ సాంగ్‌కి ఒప్పుకునే వారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఉహు అంటావా మామ’ యూట్యూబ్‌లో సెన్సెషన్ అయింది. ఈ సాంగ్‌లో సమంత తన అందచందాలతో యువతను మెస్మరైజ్ చేసేసింది. దీంతో ఆమెకు పలు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఇదే బాటలో కొందరు టాలీవుడ్ హీరోయిన్లు క్యూ కడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా కూడా చేరారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఓరియంట్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇంత సడన్‌గా ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజం చెప్పాలంటే అప్పట్లో నటనకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అందానికి, గ్లామరస్ పాత్రలకు అభిమానులు తయారవుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ సంపాదిస్తే.. హీరోయిన్లకు అంత క్రేజ్ ఉన్నట్లు. వాళ్ల ఫాలొవర్స్‌ ను బట్టే వారికి క్రేజ్. ఈ వరుసలో చాలా మంది స్టార్‌లు ముందు వరుసలో ఉన్నారు.

యంగ్ హీరోల సరసన నటించిన రెజీనాకు టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. కాగా.. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో ఐటం సాంగ్‌లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆ ముద్దుగుమ్మ స్టెప్పులు వేయనుంది. కాగా.. ఇటీవల ఆమె ఈ పాటపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘ఇప్పటివరకు నేను ఐటం సాంగ్‌ చేయలేదు. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్. కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. చిరంజీవితో కలిసి సాంగ్ చేయాలని.. ఆ టైంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. మెగాస్టార్‌ను ఇప్పటివరకు కలవని నాకు.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. చిరంజీవి ఎంతో గ్రేస్ ఫుల్‌గా డ్యాన్స్ చేస్తారు. పాట చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది.’’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: