మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీ అయ్యాడు మెగాస్టార్. ఇక తాజాగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రామ్చరణ్ తో పాటుగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపించనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించి ఆకట్టుకోనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ లో పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇవి చూసిన తర్వాత ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది ప్రేక్షకులకు.

ఇక చిరంజీవిసినిమా తర్వాత ఒక మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నారు .అయితే రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.  గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను కూడా ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం మూవి రీమేక్ తో రాబోతున్నారట. ఈ సినిమాకు మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు భోళా శంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.అయితే కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తోంది.  ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. వీటితో పాటుగా చిరు దర్శకుడు బాబీ డైరెక్షన్ లో సినిమా ఓకే చేశారు చిరు.  

మాస్ మసాలా కథతో తెరకెక్కినుందట ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చూస్తే మెగాస్టార్ మత్యకారుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.ఇక ఈ సి సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ తో రొమాన్స్ చేయండని శ్రుతిహాసన్ ని రంగంలోకి దిగుతుందని  సమాచారం. అయితే క్రాక్ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈమె బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ప్రస్తుతం మెగా ఆఫర్ కొట్టేసిందట ఈ బ్యూటీ. ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: