ఛలో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచి రిఫ్రెష్ కలిగించిన ఈ దర్శకుడు తప్పకుండా మంచి దర్శకుడు అవుతాడని ఆ సినిమాతో నిరూపించుకొన్నాడు. మంచి కామెడీ తో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ. పలు వివాదాల్లో ఇరుక్కున్న కూడా ఈ దర్శకుడికి ఈ సినిమా పరంగా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. రష్మిక హీరోయిన్ గా పరిచయం అయింది. అలా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశాడు. 

ఆ విధంగా ఆయన తన తదుపరి సినిమాను నితిన్ తో చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక సూత్రం ఉంటుంది. ఏ దర్శకుడైతే ద్వితీయ విఘ్నం ని దాటి హిట్ అందుకుంటాడో ఆ దర్శకుడికి ఎదురు లేదు అని అందరు నమ్ముతూ ఉంటారు. అలా వెంకీ కుడుముల ద్వితీయ విజ్ఞానాన్ని అవలీలగా దాటడం తో అందరూ ఎంతగానో సంతోషించారు. నితిన్ తో కలిసి చేసిన భీష్మ సినిమా ఘన విజయం సాధించి దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తోపాటు అగ్ర దర్శకుడు అనే బిరుదును కూడా తీసుకు వచ్చింది.

అయితే రెండు సినిమాలను చేసి సూపర్ హిట్ సాధించిన తర్వాత ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలామంది యంగ్ హీరోలు ప్రయత్నించారు కానీ ఈ దర్శకుడు మాత్రం పెద్ద హీరోలతో సినిమా చేయాలని చెప్పి మొదటగా రామ్ చరణ్ తో ట్రావెల్ అయ్యాడు. అది కాస్త కుదరకపోవడంతో చిరంజీవితో ఆయన సినిమాకు ఓకే చేసుకుని ఆ చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తొలి రెండు సినిమాల లాగానే మెగాస్టార్ చిరంజీవి సినిమా కథ ఉండబోతుంది అని తెలుస్తుంది. చిరంజీవి కామెడీ అన్న కామెడీ కథలు అన్న ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే ఎంతో సరదాగా సాగే బాధ్యతతో సాగే ఓ మంచి కథను చిరంజీవికి చెప్పి ఒప్పించిన వెంకీ కుడుముల ఇప్పుడు చిరంజీవి తో చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఎంతవరకు సక్సెస్ చేసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: